టోక్యో, ఫిబ్రవరి 3: మెదడులో ఏర్పడిన కణితుల గురించి ఇప్పుడు చాలా సులభంగా తెలుసుకోవచ్చు. కేవలం మూత్ర పరీక్ష చేయడం ద్వారా ఈ కణితులను గుర్తించవచ్చని శాస్త్రవేత్తలు చెప్పారు. తద్వారా క్యాన్సర్ను ప్రారంభ దశలోనే గుర్తించడం వల్ల చికిత్స సులభం అవుతుందని, వ్యాధి నుంచి రోగి త్వరగా కోలుకునే అవకాశముంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. గతంలో ఈ రకమైన కణితులను గుర్తించాలంటే చాలా క్లిష్టమైన పరీక్షలు జరపాల్సి వచ్చేదని, కానీ ఇప్పుడు చిటికెలో తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఏసీఎస్ నానో జర్నల్లో ప్రచురితమయ్యాయి.