మాలే: మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ మయిజ్జు (Mohamed Muizzu) భారత వ్యతిరేక వైఖరికి ఓ బాలుడు బలయ్యాడు. భారతదేశం అందించిన ఎయిర్క్రాఫ్ట్ను (Dornier Aircraft) వినియోగించడానికి మయిజ్జు నిరాకరించడంతో బ్రెయిన్ స్ట్రోక్తో (Brain Stroke) 14 ఏండ్ల బాలుడు మరణించాడు. గాఫ్ అలీఫ్ విల్లింగిలి గ్రామానికి చెందిన ఓ కుర్రాడు బ్రెయిన్ స్ట్రోక్తో బాధపడుతున్నాడు. అతని పరిస్థితి విషమించడంతో రాజధాని మాలేలోని దవాఖానకు వేగంగా తరలించడానికి ఎయిర్ అంబులెన్స్ (Air Ambulance) కోసం అతని కుటుంబ సభ్యులు అభ్యర్థించారు. కానీ అనుమతి లభించకచలేదు. దీంతో 16 గంటల తర్వాత మాలేకి తీసుకెళ్లినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది.
స్ట్రోక్ వచ్చిన వెంటనే బాలున్ని మాలేకి తీసుకురావడానికి ఐలాండ్ ఏవియేషన్కు ఫోన్ చేశామని బాలుడి తండ్రి చెప్పారు. కానీ తమ కాల్కు సమాధానం అందలేదని, ఉదయం 8.30 గంటలకు అటు నుంచి సమాధానం వచ్చిందన్నారు. సాధారణంగా ఇలాంటి కేసులకు ఎయిర్ అంబులెన్స్ ఉండటమే పరిష్కారమని వెల్లడించారు. కాగా, ఇరుదేశాల మధ్య నెలకొన్న వివాదాల నేపథ్యంలో మానవతా దృక్పదంతో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL)కు చెందిన ఎయిర్ క్రాఫ్ట్ను భారత్ అందించింది. దానిని వినియోగించడానికి అధ్యక్షుడు అనుమతించలేదు.