ఇస్లామాబాద్, జూలై 30: పాకిస్థాన్లో ఘోరం జరిగింది. ఓ రాజకీయ పార్టీ మీటింగ్లో బాంబు పేలి 44 మంది దుర్మరణం పాలవగా.. 200 మందికి పైగా గాయాలపాలయ్యారు. ఖైబర్ పంక్తుఖ్వా ప్రావిన్స్లోని బజౌర్ జిల్లాలో ఆదివారం జమైత్ ఉలేమా- ఈ-ఇస్లాం-ఫాజిల్ పార్టీ మీటింగ్ నిర్వహించింది.
మీటింగ్ జరుగుతుండగా ఒక్కసారిగా భారీ బాంబు పేలింది. పేలుడు ధాటికి 44 మంది మృతిచెందారు. ఆత్మాహుతి దాడి అయి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.