లండన్, మార్చి 26: మనుషుల చెమట వాసనను సోషల్ యాంగ్జైటీకి వంటి కొన్ని మానసిక సమస్యల చికిత్సకు ఉపయోగించడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయని యూరోపియన్ సైకియాట్రిక్ అసోసియేషన్ (ఈపీఏ)కు చెందిన శాస్త్రవేత్తలు తెలిపారు. శాస్త్రవేత్తలు 15 నుంచి 35 ఏండ్ల మధ్య వయసు గల 48 మంది మహిళా వలంటీర్లపై ఈ అధ్యయనం జరిపారు.
మనుషుల కీమో సిగ్నల్స్ ద్వారా పేషెంట్లలో సోషల్ యాంగ్జైటీ తగ్గుతున్నదని ఇందులో గుర్తించారు. చెమటలోని కెమికల్స్ను కీమో సిగ్నల్స్ అంటారు. మైండ్ఫుల్నెస్ థెరఫీ చికిత్సతో పాటు కీమోసిగ్నల్స్ను ఇవ్వడం ద్వారా సోషల్ యాంగ్జైటీని నయం చేయడంలో మెరుగైన ఫలితాలు వస్తున్నాయని శాస్త్రవేత్త ఎలీసా విజ్ఞ తెలిపారు. కేవలం ఒక సెషన్ మైండ్ఫుల్నెస్ థెరఫీ తీసుకున్న వారిలో 17 శాతం యాంగ్జైటీ తగ్గుతుందని, అదే మైండ్ఫుల్నెస్ థెరఫీతో పాటు మానవ శరీర చెమట వాసన తీసుకున్న పేషెంట్లలో 39 శాతం యాంగ్జైటీ తగ్గిందని ఆమె పేర్కొన్నారు.