కోపెన్హెగన్, అక్టోబర్ 23: గర్భంతో ఉన్నపుడు అధిక రక్తపోటుకు గురైతే పుట్టే బిడ్డకు మరణం ముప్పు ఉంటుందని తాజా అధ్యయనం హెచ్చరించింది.
డెన్మార్క్లో దాదాపు 20 లక్షల మందిని పరీక్షించగా, బీపీ ఉన్న తల్లుల బిడ్డలు చనిపోయే ప్రమాదం ఎక్కువగా ఉన్నట్టు తేలింది. ప్రపంచ వ్యాప్తంగా 10 శాతం మంది గర్భిణులు అధిక రక్తపోటుతో బాధపడుతున్నారని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.