కాబూల్ : ఆప్షనిస్ధాన్లో భారీ పేలుడు కలకలం రేపింది. కాబూల్లోని కార్తే పర్వాన్ గురుద్వార గేటు సమీపంలో బుధవారం పేలుడు సంభవించింది. పేలుడులో భారతీయులెవ్వరూ గాయపడలేదని, అందరూ క్షేమంగా ఉన్నారని ఇండియన్ వరల్డ్ ఫోరం ప్రెసిడెంట్ పునీత్ సింగ్ చంధోక్ పేర్కొన్నారు. పేలుడులో ఎలాంటి ప్రాణనష్టం వివరాలు వెలుగుచూడక పోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.
పేలుడుకు ఎవరు పాల్పడ్డారనే విషయంపై ప్రాధమిక దర్యాప్తు అనంతరం వివరాలు వెల్లడికానున్నాయి. ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ల ఆధీనంలోకి వచ్చినప్పటి నుంచీ అక్కడి సిక్కు వర్గాలను టార్గెట్ చేసుకుని దాడులకు తెగబడుతున్నారు. ఇక కాబూల్ సిక్కు గురుద్వారా వద్ద పేలుడు ఘటనపై భారత్ విదేశాంగ శాఖ వాకబు చేస్తోంది.