కీవ్: ఉక్రెయిన్పై రష్యా యుద్ధం నేపథ్యంలో ప్రజలు ఆ దేశాన్ని వీడుతున్నారు. దీంతో ఉక్రెయిన్లోని పలు నగరాలు ఖాళీ అవుతున్నాయి. తాజాగా ఇర్పిన్ నగరానికి చెందిన కొందరు చివరి బ్యాచ్గా అక్కడి నుంచి బస్సుల్లో వెళ్లారు. నాలుగేళ్ల పాప డారియా కూడా ఇందులో ఉన్నది. అయితే అదే రోజున ఆ పాప నాలుగో ఏట ప్రవేశించింది. దీంతో సొంత ఊరిని వీడుతున్న బస్సులోనే క్యాండిల్, కేక్ లేకుండా పుట్టిన రోజును జరుపుకోవాల్సి వచ్చింది. తమ కుమార్తె నాలుగో పుట్టిన రోజును ఎంతో వేడుకగా చేయాలని భావించినట్లు ఆ పాప తల్లి సుసన్నా సోపెల్నికోవా తెలిపారు. అయితే రష్యా దాడుల వల్ల తమ ఇల్లు ధ్వంసమైందని ఆమె చెప్పారు. దాడులు మరింతగా పెరుగుతుండటంతో ప్రాణాలను కాపాడుకునేందుకు తమ కుమార్తె పుట్టిన రోజు నాడే ఇర్పిన్ను వీడాల్సి వచ్చిందన్నారు.
కాగా, రష్యా దాడుల వల్ల గత కొన్ని రోజులుగా ఇళ్ల నుంచి బయటకు రాలేకపోయినట్లు ఇర్పిన్కు చెందిన ఒక వృద్ధురాలు వాపోయింది. తాగునీరు, విద్యుత్ సరఫరా లేదని, దీంతో ప్రాణాలను కాపాడుకునేందుకు గడ్డకట్టే చలిలో పెద్దలు, పిల్లలు నగరాన్ని వీడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
మరోవైపు ఉక్రెయిన్పై రష్యా యుద్ధం ప్రారంభమైన ఫిబ్రవరి 24 నుంచి ఇప్పటి వరకు సుమారు పది లక్షలకుపైగా ప్రజలు ఆ దేశాన్ని వీడినట్లు ఐక్యరాజ్య సమితి (ఐరాస) తెలిపింది. లక్షల సంఖ్యలో ఉక్రెయిన్ ప్రజలు వలసపోవడంపై ఆందోళన వ్యక్తం చేసింది.
VIDEO: No candles or cake for birthday girl forced to flee #Ukraine town
For her 4th birthday, Daria got a bus ride out of #Irpin. Her family were among the last to leave the town to Kyiv’s northwest, scene of some the worst fighting in Russia’s invasion of Ukraine pic.twitter.com/fAqB78lpCS
— AFP News Agency (@AFP) March 26, 2022