Citadel CEO : పండుగల సమయంలో చాలా కంపెనీలు ఉద్యోగులకు కార్లు, గిఫ్ట్ కూపన్లు వంటివి బహుమతిగా ఇస్తాయి. కానీ, అమెరికాలోని సిటాడెల్ సీఈఓ కెన్నెథ్ సి. గ్రిఫిన్ తమ కంపెనీ 20వ వార్షికోత్సవం సందర్బంగా ఉద్యోగులకు భారీ ఆఫర్ ప్రకటించాడు. వాళ్లకు జీవితాంతం గుర్తుండిపోయేలా ఖరీదైన టూర్ ప్యాకేజీకి డబ్బులు చెల్లించాడు. దాంతో, వాళ్లంతా ఫ్యామిలీతో కలిసి మూడు రోజులు ఫ్లోరిడాలోని వాల్ట్డిస్నీలో సరదాగా గడిపేలా చేశాడు.అలాగని పదిమంది వందమందికి కాదు.. 10వేల మంది ఉద్యోగులకు. అది కూడా సొంత డబ్బుతో. ఉద్యోగుల విమాన టికెట్లు, హోటల్ బుకింగ్స్, పార్కింగ్ టికెట్లు అన్నిటికీ గ్రిఫిన్ ముందుగానే డబ్బులు చెల్లించాడు అని సిటడెల్ అధికార ప్రతినిధి వెల్లడించాడు.
అంతేకాదు ఉద్యోగులు ఎంజాయ్ చేసేందుకు ఫేమస్ రాక్ బ్యాండ్ ఈవెంట్ను కూడా గ్రిఫిన్ ఏర్పాటు చేశాడు. బ్రిటన్కు చెందిన కోల్డ్ ప్లే రాక్బ్యాండ్ ప్రదర్శన చేయనుంది. మూడు రోజులు ఫ్యామిలీతో వాల్ట్ డిస్నీ వరల్డ్లో ఎంజాయ్ చేసే అవకాశం రావడంతో సిటాడెల్ ఉద్యోగులు పట్టలేనంత సంతోషంతో ఉన్నారు. గ్రిఫిన్కు 60 బిలియన్ డాలర్ల ఆస్తులు ఉన్నాయి. నవంబర్ నెలలో ఆయన వెల్లింగ్టన్ ఫండ్ 32 శాతం లాభం వచ్చింది. దాంతో, కంపెనీ విజయానికి పాటుపడిన ఉద్యోగులకు భారీ టూర్ ప్యాకేజీ ప్రకటించాడు.