మ్యూనిచ్: మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. కరోనా వ్యాక్సిన్ల కన్నా.. ఒమిక్రాన్ వేరియంట్తోనే ఎక్కువ ఇమ్యూనిటీ లభిస్తోందన్నారు. జర్మనీలోని మునిచ్ సెక్యూర్టీ కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. అయితే రాబోయే మహమ్మారి కొత్త తరహా క్రిమి నుంచి వ్యాపించే అవకాశాలు ఉన్నట్లు ఆయన హెచ్చరించారు. మెడికల్ టెక్నాలజీ చాలా విస్తరంగా పెరిగిందని, రాబోయే రోజుల్లో కేవలం ఆరు నెలల్లోనే వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తాయన్నారు. కోవిడ్19 రిస్క్ చాలా వరకు ఊహించనిరీతిలో తగ్గిందని, కానీ మరో మహమ్మారి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఒమిక్రాన్ వేరియంట్పై బిల్ గేట్స్ కామెంట్ చేస్తూ.. ఆ వేరియంట్ వల్ల పాజిటివ్ వ్యక్తుల్లో వేగంగా ఇమ్యూనిటీ రెట్టింపు అవుతోందన్నారు. అది వ్యాక్సిన్లు ఇచ్చే రోగనిరోధక శక్తి కన్నా బలంగా ఉందన్నారు. ఒమిక్రాన్ వేరియంట్ ఓ వ్యాక్సిన్ అని ఆయన అభిప్రాయపడ్డారు. ఒమిక్రాన్ వేరియంట్ శరీరంలో బీ కణాలు, టీ కణాల ఇమ్యూనిటీని ఇస్తోందన్నారు. వ్యాక్సిన్లు చేయలేని పనులను.. ఒమిక్రాన్ వేరియంట్ చేసిందన్నారు.