Sheikh Hasina | ఢాకా, ఏప్రిల్ 1: దేశంలో భారత వ్యతిరేక సెంటిమెంట్ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్న ప్రతిపక్ష పార్టీ నేతలపై బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్ను తర్వాత వ్యతిరేకించవచ్చు కానీ, తొలుత మీ భార్యలు కట్టుకున్న భారత చీరలను తగలబెట్టాలని సూచించారు.
జనవరిలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో హసీనా వరుసగా నాలుగోసారి ప్రధానిగా ఎన్నికయ్యారు. దీన్ని జీర్ణించుకోలేకపోతున్న ప్రతిపక్ష బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) ‘బాయ్కాట్ ఇండియా’ ఉద్యమాన్ని లేవనెత్తింది. హసీనా భారత అనుకూల వాది అని, ఆమె గెలుపులో భారత్ హస్తముందని ఆరోపించింది. బంగ్లాదేశ్ ప్రజలకు ఎన్నడూ మద్దతివ్వని భారత్..
అవామీ లీగ్ (హసీనా పార్టీ)కి మాత్రం మద్దతు ఇస్తోందని, ప్రజల ఆగ్రహానికి ఇదే కారణమని బీఎన్పీ నాయకుడు రాహుల్ కబీర్ రిజ్వీ ఆరోపించారు. భారత్పై ప్రతిపక్షాల రెచ్చగొట్టే వ్యాఖ్యలను ప్రధాని హసీనా తిప్పికొట్టారు. బీఎన్పీ నేతలు నిజంగా భారత ఉత్పత్తులను బహిష్కరించాలనుకుంటే తొలుత వారి భార్యలు కట్టుకొనే భారత చీరలను తగలబెట్టాలని అన్నారు.