Baltimore Bridge | అమెరికాలోని బాల్టిమోర్ నగరంలో బ్రిడ్జిని ఢీకొట్టిన కార్గోషిప్ లో 22 మంది నావికులు ఉన్నారు. నావికులంతా భారతీయులేనని, వారంతా క్షేమమని తెలుస్తున్నది. సింగపూర్ కు చెందిన గ్రీన్ ఓషన్ ప్రైవేట్ లిమిటెడ్ కార్గో నౌక ‘దాలీ’.. బాల్టిమోర్ నుంచి కొలంబోకు బయలుదేరింది. మంగళవారం తెల్లవారుజామున 1.30 గంటల సమయంలో ఫ్రాన్సిస్ స్కాట్ కీ బ్రిడ్జిలోని ఓ ఫిల్లర్ ను కార్గోషిప్ ఢీకొట్టింది. ఈ సమయంలో నౌక నడుపుతున్న ఇద్దరు పైలట్లు విధులు నిర్వహిస్తున్నారు.
ఆ వంతెన కూలిపోవడంతో దానిపై వెళుతున్న పలు వాహనాలు నదిలో పడిపోయారని సమాచారం. సుమారు 20 మంది ఆచూకీ గల్లంతైనట్లు తెలుస్తున్నది. తత్ఫలితంగాపటాప్ స్కో నది మీదుగా రాకపోకలు నిలిపేశారు. ఈ ఘటనపై అమెరికా దర్యాప్తు ప్రారంభించింది. మరోవైపు, సహాయ సిబ్బంది భారీ ఎత్తున సహాయ చర్యలు చేపట్టారు.