సిడ్నీ: అస్ట్రేలియాకు చెందిన ఓ మహిళా ఎంపీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్య దేవాలయమైన దేశ పార్లమెంట్ భవనంలోనే మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, ఓ శక్తివంతమైన వ్యక్తి చేతిలో తాను లైంగిక వేధింపులకు గురయ్యాయని లిదియా త్రోప్ పేర్కొన్నారు.
గురువారం సెనేట్లో ఆమె ఉద్విగ్న ప్రసంగం చేస్తూ తాను ఎదుర్కొన్న లైంగిక వేధింపులను వివరించారు. కన్జర్వేటివ్ పార్టీ ఎంపీ డేవిడ్ వాన్ తనతో దారుణంగా ప్రవర్తించారని, వెంట పడుతూ అసభ్యకరంగా తాకాడని ఆరోపించారు.