వజీరాబాద్: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్పై ఏకే-47 గన్తో అటాక్ చేశారు. వజీరాబాద్లో జరిగిన ర్యాలీలో ఆయనపై దాడి జరిగిన విషయం తెలిసిందే. అయితే దుండగుడు సమీపం నుంచే ఏకే-47 గన్తో కాల్చినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఇమ్రాన్ ఖాన్ కాలులోకి మూడు లేదా నాలుగు సార్లు బుల్లెట్లు దిగినట్లు పీటీఐ పార్టీ నేత ఇమ్రాన్ ఇస్మాయిల్ తెలిపారు.
Imran Khan was shot in the leg but was stable while being taken to hospital. He waived at supporters too. #عمران_خان_ہماری_ریڈ_لائن_ہے pic.twitter.com/XizoAQzPax
— PTI (@PTIofficial) November 3, 2022
ఇమ్రాన్పై దాడి జరిగినప్పుడు తాను పక్కనే ఉన్నట్లు ఇస్మాయిల్ చెప్పారు. గాయపడ్డ ఇమ్రాన్ను వెంటనే హాస్పిటల్కు తీసుకువెళ్లారు. వజీరాబాద్ లాంగ్ మార్చ్ సమయంలో ఇమ్రాన్పై దాడి జరిగినట్లు పీటీఐ నేత ఫవద్ చౌదరీ తెలిపారు. ఈ దాడిలో మరో ముగ్గురు గాయపడ్డారు. దాంట్లో సేనేటర్ ఫైసల్ జావెద్, అహ్మద్ ఛాతా ఉన్నారు.
Injured in the assassination attempt on Imran Khan, Senator @FaisalJavedKhan speaks exclusively. #عمران_خان_ہماری_ریڈ_لائن_ہے pic.twitter.com/PyrgQoeTs7
— PTI (@PTIofficial) November 3, 2022