కరాచీ, మార్చి 26: పాకిస్థాన్లోని బలూచిస్థాన్ ప్రావిన్స్లోని ప్రధాన నౌకాదళ వైమానిక స్థావరాల్లో ఒకదానిపై బలూచ్ మిలిటెంట్లు దాడికి దిగారు. వెంటనే అప్రమత్తమైన పాక్ సాయుధ బలగాలు ఎదురుదాడికి దిగాయి. ఈ దాడుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ సంఘటన సోమవారం రాత్రి టర్బాత్లో జరిగింది. పీఎన్ఎన్ సిద్ధిక్ నావల్ ఎయిర్ బేస్ దగ్గర సాయుధ ఉగ్రవాద దాడిని భద్రతా దళాలు భగ్నం చేశాయని మక్రాన్ కమిషనర్ సయీద్ అహ్మద్ ఉమ్రానీ తెలిపారు.
ఆత్మాహుతి దాడిలో ఐదుగురు చైనీయుల మృతి
చైనీయులే లక్ష్యంగా పాకిస్థాన్లో మరోసారి ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో ఐదుగురు చైనీయులతో పాటు ఓ స్థానికుడు కూడా మృతి చెందాడు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. చైనా ఇంజినీర్లతో ఓ బస్సు ఇస్లామాబాద్ నుంచి కోహిస్థాన్కు వెళ్తుండగా పేలుడు పదార్థాలతో నిండి వున్న మరో వాహనం వచ్చి ఢీకొనటంతో ఈ ప్రమాదం జరిగింది.