కీవ్: ఉక్రెయిన్లోని మారిపోల్లో ఉన్న మెటర్నిటీ హాస్పిటల్పై రష్యా బాంబు దాడి చేసిన విషయం తెలిసిందే. ఆ దాడిలో ముగ్గురు మరణించినట్లు తాజాగా తెలుస్తోంది. దాంట్లో ఓ చిన్నారి ఉన్నారు. ఆ అటాక్లో కనీసం 17 మంది గాయపడినట్లు ఆ నగర డిప్యూటీ మేయర్ తెలిపారు. వారిలో గర్భిణులు కూడా ఉన్నట్లు ఆయన చెప్పారు. నగరంలో ఉన్న మూడవ ఆస్పత్రిని టార్గెట్ చేశారని ఆయన అన్నారు. మారిపోల్లో ఉన్న 300 బెడ్స్ ఉన్న కోవిడ్ రోగుల హాస్పిటల్పై కూడా బాంబుల వర్షం కురిసింది. అక్కడే ఉన్న బ్లడ్ కలెక్షన్ సెంటర్పై కూడా దాడి జరిగింది. ఇప్పటి వరకు ఉక్రెయిన్లో ఉన్న 18 హెల్త్ ఫెసిలిటీ కేంద్రాలపై దాడులు జరిగినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది. అయితే రష్యా యుద్ధ నేరాలకు పాల్పడుతున్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు వోల్డోమిర్ జెలెన్స్కీ ఆరోపించారు.