క్విటో, మార్చి 19: ఈక్వెడార్, పెరూలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.8గా నమోదైంది. భూకంపం కారణంగా ఈక్వెడార్లో 13 మంది, పెరూలో నాలుగేండ్ల బాలిక దుర్మరణం చెందారు. వందలాది భవనాలు దెబ్బతిన్నాయి.
పసిఫిక్ తీరానికి 80 కిలోమీటర్ల దూరంలోని దక్షిణ ఈక్వెడార్, తూర్పు పెరూ ప్రాంతాల్లో భూకంపం సంభవించిందని అమెరికా భౌగోళిక సర్వే వెల్లడించింది. టెలిఫోన్, విద్యుత్తు సేవలకు అంతరాయం ఏర్పడింది.