న్యూయార్క్: ఉక్రెయిన్పై రష్యా చేస్తున్న దాడిలో ఇప్పటి వరకు 136 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు ఐక్యరాజ్యసమితి తెలిపింది. గడిచిన గురువారం నుంచి ఉక్రెయిన్పై రష్యా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. చనిపోయినవారిలో 13 మంది చిన్నారులు ఉన్నట్లు యూఎన్ చెప్పింది. కానీ ఉక్రెయిన్ వార్లో మరణించిన వారి సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని యూన్ మానవహక్కుల హై కమీషనర్ లిజ్ త్రోసెల్ తెలిపారు. భారీ ఆర్టిల్లరీ షెల్లింగ్, వైమానిక దాడులు, పేలుళ్లతో ప్రాణ నష్టం కలిగినట్లు యూఎన్ తెలిపింది. ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధంలో ఇప్పటి వరకు 400 మంది గాయపడినట్లు కూడా యూఎన్ చెప్పింది. కానీ ఉక్రెయిన్ రిలీజ్ చేసిన రిపోర్ట్ ప్రకారం. .ఆ దేశంలో ఇప్పటి వరకు 352 మంది పౌరులు మరణించారు. 1684 మంది గాయపడ్డారు.