Arunachal Pradesh | వాషింగ్టన్, జూలై 14: అరుణాచల్ ప్రదేశ్ విషయంలో భారత్కు అమెరికా అండగా నిలిచింది. అరుణాచల్ భారత్లో అంతర్భాగమేనని ఆ దేశ విదేశీ సంబంధాల కమిటీ ఈ మేరకు ఒక తీర్మానాన్ని సెనేట్లో ప్రవేశపెట్టింది. ఒకే రకమైన అభిప్రాయాలు కలిగిన భాగస్వాములతో సహకారాన్ని పెంపొందించుకొనేందుకు కట్టుబడి ఉన్నట్టు తీర్మానం పేర్కొంది.
ఈ తీర్మానం ఆమోదం పొందితే అరుణాచల్ సరిహద్దుల్లో మౌలిక సదుపాయాలు పెంపొందించేందుకు అమెరికా సాయం చేసే అవకాశం ఉంది.