వాషింగ్టన్: ఐఫోన్ తయారీదారు యాపిల్ కంపెనీకి 2024 ప్రారంభంలోనే చేదు వార్త ఎదురైంది. డిమాండ్పరమైన ఇబ్బందులు పెరుగుతుండటంతో మైక్రోసాఫ్ట్ కంపెనీ కన్నా వెనుకబడింది. ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీగా మైక్రోసాఫ్ట్ నిలిచింది.
వాషింగ్టన్ కేంద్రంగా పని చేస్తున్న మైక్రోసాఫ్ట్ షేర్ల విలువ గురువారం 1.5% పెరిగింది. దీంతో మైక్రోసాఫ్ట్ మార్కెట్ విలువ గురువారం 2.888 ట్రిలియన్ డాలర్లకు పెరిగింది. యాపిల్ కంపెనీ మార్కెట్ విలువ 2.887 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. మైక్రోసాఫ్ట్ కన్నా తక్కువ విలువకు యాపిల్ విలువ పతనమవడం 2021 తర్వాత ఇదే మొదటిసారి. ఐఫోన్ అమ్మకాలు బలహీనపడటం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది.