ఢాకా: దేశంలో సాధారణ ఎన్నికలకు రెండు రోజుల ముందు బంగ్లాదేశ్లో మరో హిందువును హత్య చేశారు. మైమన్సింగ్ జిల్లా త్రిశల్ ఉప జిల్లాలోని బోగర్ బజార్లో సోమవారం రాత్రి సుషేన్ చంద్రశేఖర్ (62) అనే ఒక బియ్యం వ్యాపారిని అతని దుకాణంలోనే కొందరు దుండగులు పొడిచి హత్య చేశారు. చంద్రశేఖర్ తన షాపులో ఉండగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అతడిని పదునైన ఆయుధాలతో పొడిచి చంపి, తర్వాత షాపు షట్టర్ వేసి అక్కడి నుంచి పరారయ్యారు.