ఢాకా: విమానం గాల్లో ఉండగా అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు ప్రయాణికులు కొట్టుకున్నారు. ఒకరిపై మరొకరు పంచ్లు ఇచ్చుకున్నారు. పొరుగు దేశమైన బంగ్లాదేశ్లో ఈ సంఘటన జరిగింది. ఆ దేశ జాతీయ విమానయాన సంస్థ బిమన్ బంగ్లాదేశ్ ఎయిర్లైన్స్ విమానంలో ఈ కోట్లాట జరిగింది. ఆ సంస్థకు చెందిన బోయింగ్ 777 విమానం గాల్లో ఎగురుతుండగా ఇద్దరు ప్రయాణికులు ఘర్షణకు దిగారు. చొక్కా తీసేసి ఉన్న యువకుడు, పక్క సీటు వ్యక్తి మధ్య గొడవ జరిగింది. దీంతో పైకి లేచిన ఆ యువకుడు సీటులో కూర్చొని ఉన్న వ్యక్తిపై పంచ్లు ఇచ్చాడు. మరోవైపు సీటులో కూర్చొన్న వ్యక్తి కూడా యువకుడి చెంపపై కొట్టాడు. ఇంతలో తోటి విమాన ప్రయాణికులు, విమాన సిబ్బంది జోక్యం చేసుకున్నారు. వారిద్దనీ విడదీశారు. విమానంలోని కొందరు ప్రయాణికులు తమ మొబైల్ ఫోన్లో రికార్డ్ చేసిన వీడియో క్లిప్ను ట్విట్టర్లో పోస్ట్ చేయగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
కాగా, ఇటీవల థాయ్ స్మైల్ ఎయిర్వేస్ విమానంలో కూడా ఇలాంటి సంఘటన జరిగింది. బ్యాంకాక్ నుంచి కోల్కతాకు ప్రయాణిస్తున్న విమానంలో ఇద్దరు ప్రయాణికులు గొడవ పడ్డారు. క్యాబిన్ సిబ్బంది పేర్కొన్న భద్రతా సూచనలను పాటించేందుకు ఒక వ్యక్తి నిరాకరించాడు. ఈ నేపథ్యంలో మరోవ్యక్తి జోక్యం చేసుకోవడంతో వారిద్దరి మధ్య ఘర్షణ జరిగింది.
Another "Unruly Passenger" 👊
This time on a Biman Bangladesh Boeing 777 flight!🤦♂️ pic.twitter.com/vnpfe0t2pz— BiTANKO BiSWAS (@Bitanko_Biswas) January 7, 2023