ఢాకా: పొరుగు దేశమైన బంగ్లాదేశ్లో హిందువులు, హిందూ ఆలయాలపై దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా మరో ఇస్కాన్ కేంద్రానికి దుండగులు నిప్పుపెట్టారు. (Iskcon centre Set on fire) అందులోని దేవుడి విగ్రహాలను ధ్వంసం చేశారు. బంగ్లాదేశ్ రాజధాని ఢాకా జిల్లాలో ఈ సంఘటన జరిగినట్లు ఇస్కాన్ కోల్కతా వైస్ ప్రెసిడెంట్ రాధారామన్ దాస్ తెలిపారు. శనివారం తెల్లవారుజామున 2-3 గంటల సమయంలో నామ్హట్టాలో ఇస్కాన్ కేంద్రం పరిధిలోని రాధా కృష్ణ దేవాలయం, మహాభాగ్య లక్ష్మీ నారాయణ ఆలయానికి దుండగులు నిప్పు పెట్టినట్లు తెలిపారు. ఆలయం పైకప్పులను తొలగించి లోపల పెట్రోల్ పోసి నిప్పంటించారని చెప్పారు. దీంతో విగ్రహాలతోపాటు ఇతర వస్తువులు మంటల్లో కాలి ధ్వంసమయ్యాయని ఎక్స్ పోస్ట్లో పేర్కొన్నారు.
కాగా, బంగ్లాదేశ్లోని ఇస్కాన్ కేంద్రాలపై దాడులు కొనసాగుతున్నాయని రాధారామన్ దాస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆ దేశంలోని తాత్కాలిక ప్రభుత్వం దృష్టికి ఈ దాడుల విషయం తీసుకెళ్లినప్పటికీ ఎలాంటి ఫలితం లేదని విమర్శించారు. తమ ఆవేదన తగ్గించేందుకు, ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం, పోలీసులు ఏమీ చేయడం లేదని ఆరోపించారు.
Another ISKCON Namhatta Centre burned down in Bangladesh. The Deities of Sri Sri Laxmi Narayan and all items inside the temple, were burned down completely 😭. The center is located in Dhaka. Early morning today, between 2-3 AM, miscreants set fire to the Shri Shri Radha Krishna… pic.twitter.com/kDPilLBWHK
— Radharamn Das राधारमण दास (@RadharamnDas) December 7, 2024