లండన్, సెప్టెంబర్ 3: అమెరికన్లు తమ దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా భారతీయులపై జాత్యాహంకారాన్ని ప్రదర్శిస్తున్నారు. తాజాగా పోలండ్లో ఓ భారతీయుడిపై అమెరికాకు చెందిన ఓ వ్యక్తి దుర్భాషలాడాడు. ‘మీరు పరాన్నజీవులు, చొరబాటుదారులు.. మీ దేశానికి వెళ్లిపో’ అని హూంకరించాడు. ఈ ఘటన పోలండ్ రాజధాని వార్సాలో చోటుచేసుకున్నది.
‘అమెరికాలో కూడా మీవాళ్లు చాలా మంది ఉన్నారు. ఇక్కడ ఎందుకున్నారు? మీరు మీ దేశానికి ఎందుకు వెళ్లరు?’ అని ఆ అమెరికన్ అన్నాడు. ‘మా దేశాల్లోకి చొరబడుతున్నారు.. తెల్ల వాళ్ల దేశాలకు ఎందుకు వస్తున్నారు? యూరప్లో ఉండొద్దు, పోలండ్ పోలిష్లకు మాత్రమే’ అంటూ అహంకారాన్ని ప్రదర్శించాడు. అమెరికన్ తీరును సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రంగా తప్పుబడుతున్నారు.