వాషింగ్టన్ : తీవ్రవాదాన్ని సమూలంగా తొలగించాలన్న సంకల్పంతో అమెరికా యుద్ధాన్ని (America War) ప్రకటించింది. ఈ యుద్ధం కోసం అమెరికా ఏకంగా రూ.585 లక్షల కోట్లు ఖర్చు చేసింది. ఇప్పటివరకు మొత్తం 9.29 లక్షల మంది మరణించినట్లు తెలుస్తున్నది. వీరిలో దాదాపు 84 వేల మంది తీవ్రవాదులను చనిపోయినట్లు లెక్కలు చెప్తున్నాయి. అల్ ఖాయిదా నుంచి 10 కొత్త తీవ్రవాద గ్రూపులు పుట్టుకొచ్చాయి. 9/11 దాడుల తర్వాత అల్ ఖాయిదాను ప్రపంచం నుంచి తొలగించనున్నట్లు అమెరికా ప్రకటించింది. చెప్పినట్లుగానే ఆఫ్ఘనిస్తాన్తో పాటు పాకిస్తాన్, యెమెన్, సిరియా, ఇరాక్, లిబియా, ఈజిప్ట్లో కూడా తీవ్రవాదంపై దాడి చేశారు.
వరల్డ్ ట్రేడ్ సెంటర్ జంట టవర్లపై తీవ్రవాద దాడి అనంతరం అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ తీవ్రవాదంపై యుద్ధం చేశారు. 136 దేశాలు అమెరికాకు సైనిక సహాయం అందించాయి. 142 దేశాల్లో అనుమానిత తీవ్రవాదుల ఆస్తులను జప్తు చేశారు. 89 దేశాలు అమెరికా యుద్ధ విమానాల కోసం గగనతలాన్ని వాడుకునేందుకు అనుమతించాయి. 76 దేశాలు యూఎస్ విమానాలు ల్యాండింగ్ చేయడానికి అనుమతించాయి. యూఎస్తో కలిసి యుద్ధంలో పాల్గొనడానికి 23 దేశాలు సమ్మతించాయి. అమెరికా విధ్వంసంలో మొత్తం 11 తీవ్రవాద శిబిరాలు, 39 కమాండ్ సెంటర్లు ధ్వంసమయ్యాయి. అల్ ఖాయిదా ముఖ్య నేతలు ఒసామా బిన్ లాడెన్, ముల్లా ఒమర్ను హతమార్చారు.
అమెరికా యుద్ధంతో తీవ్రవాదం తుదముట్టింపు పక్కన పెడితే 10 కంటే ఎక్కువ కొత్త తీవ్రవాద సంస్థలు పుట్టుకొచ్చాయి. తీవ్రవాదం ఐసిస్, బెకో హరామ్ పేర్లతో ఇరాక్ నుంచి నైజీరియా వరకు 17 దేశాలకు వ్యాపించింది. జైష్-ఏ-మహమ్మద్, లష్కరే తోయిబా, హక్కానీతో పాటు 35 వర్గాలు దీనికి సంబంధించినవే. ఈ 20 ఏండ్లలో ఈ సమూహాలు ప్రపంచవ్యాప్తంగా 34 వేల దాడులు జరుపగా.. ఇందులో దాదాపు 70 వేల మంది మరణించినట్లు తెలుస్తున్నది. తీవ్రవాదానికి సురక్షిత దేశాలుగా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, సూడాన్, నైజీరియా, అల్జీరియా, ఎరిత్రియా, కొసావో, బోస్నియా, ఫిలిప్పీన్స్, సొమాలియా, తజికిస్తాన్, ఇరాక్, యెమెన్, సిరియాలు నిలిచాయి. వీరికి కువైట్, సౌదీ అరేబియాతోపాటు ఇతర గల్ఫ్ దేశాల నుంచి ఆర్థిక సహాయం అందినట్లు తెలుస్తున్నది.
ఉగ్రవాదుల అమానుష దాడికి 20 ఏండ్లు పూర్తి
బెంగళూరులో ‘అప్పికో ఉద్యమం’.. ఎందుకంటే?
జపాన్ యువతలో బుస కొడుతున్న హికికొమోరి
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..