గ్వదార్: పాకిస్థాన్ వ్యవస్థాపకుడు మొహమ్మద్ అలీ జిన్నా విగ్రహాన్ని ధ్వంసం చేశారు. బలోచిస్తాన్ ప్రావిన్సులో ఉన్న కోస్టల్ నగరం గ్వదార్లో ఉన్న జిన్నా విగ్రహాన్ని బలోచి మిలిటెంట్లు బాంబు దాడితో పేల్చేశారు. జూన్ నెలలో మెరైన్ డ్రైవ్ వద్ద ఆ విగ్రహాన్ని ప్రతిష్టించారు. విగ్రహం కింద పేలుడు పదార్ధాలను పెట్టి పేల్చినట్లు ఓ కథనం ద్వారా వెల్లడైంది. ఈ ఘటన సెప్టెంబర్ 26వ తేదీన జరిగింది. జిన్నా స్టాచ్యూ పూర్తిగా ధ్వంసమైంది. ఆ విగ్రహాన్ని తామే పేల్చినట్లు బలోచ్ రిపబ్లికన్ ఆర్మీ నేత బాబ్గర్ బలోచ్ తెలిపారు. ఈ ఘటన పట్ల ఉన్నత స్థాయి విచారణ చేపడుతున్నట్లు గద్వార్ డిప్యూటీ కమిషనర్ అబ్దుల్ కబీర్ ఖాన్ తెలిపారు. టూరిస్టుల రూపంలో వచ్చిన కొందరు దుండగులు విగ్రహాన్ని బాంబు పెట్టి పేల్చారని కబీర్ ఖాన్ చెప్పారు. ఇప్పటి వరకు ఎటువంటి అరెస్టు జరగలేదన్నారు.
1876, డిసెంబర్ 25వ తేదీన జిన్నా జిన్మించారు. 1913 నుంచి ఆల్ ఇండియా ముస్లిం లీగ్ నేతగా పనిచేశారు. 1947, ఆగస్టు 14న పాకిస్థాన్ ఆవిర్భవించేవారకు ఆయనే ఆ పార్టీ నేతగా ఉన్నారు. ఆ తర్వాత 1948 వరకు పాకిస్థాన్ తొలి గవర్నర్ జనరల్గా ఉన్నారు.