ఓ వైపు సౌత్ కొరియా, చైనాలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయని వార్తలు వస్తున్నా… మరో వైపు శుభ వార్తలు కూడా వస్తున్నాయి. సింగపూర్లో మాస్క్ నిబంధనలను ఎత్తేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా… మరో దేశం కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకుంది. పోలాండ్ దేశంలో కూడా మాస్క్ నిబంధనలను ఎత్తేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని పోలాండ్ ఆరోగ్య మంత్రి ఎడమ్ నీడీజీఎల్స్కీ ప్రకటించారు.
నిర్దేశించిన ప్రాంతాల్లో కూడా ఇప్పుడు మాస్కులు అవసరం లేదని ప్రకటించారు. మాస్కులతో పాటు హోం క్వారంటైన్, ఐసోలేషన్ను కూడా ఎత్తేస్తున్నట్లు ప్రకటించారు. మార్చి 28 నుంచి అమలులోకి వస్తుందన్నారు. అయితే ఆరోగ్య కార్యకర్తలకు మాత్రం ఇది వర్తించదని, వాళ్లు విధిగా మాస్కులు ధరించాల్సిందేనని పోలాండ్ సర్కార్ తేల్చి చెప్పింది.