కాబూల్ : ఆఫ్ఘనిస్థాన్లో భూకంపం పెను విధ్వంసం సృష్టించింది. రిక్టర్ స్కేల్పై 6.1 తీవ్రతతో వచ్చిన ప్రకంపనలు తీరని విషాదాన్ని మిగిల్చాయి. భూకంపం కారణంగా ఇప్పటి వరకు సుమారు 920 మంది ప్రాణాలను కోల్పోయారు. సమయం గడిచిన కొద్దీ మరణాల సంఖ్య పెరుగుతూనే ఉన్నది. ఇప్పటి వరకు 600 మందికిపైగా గాయపడ్డట్లు అధికారులు తెలిపారు. భూకంపం ధాటికి వందలాది ఇండ్లు నేలమట్టమయ్యాయి. యూఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం.. భూకంప కేంద్రం ఆఫ్ఘనిస్థాన్లోని ఖోస్ట్ నగరానికి 44 కిలోమీటర్ల దూరంలో, భూమికి 51 కిలోమీటర్ల లోతులో ఉంది.
భారీ తీవ్రతతో వచ్చిన ప్రకంపనలు పాక్లోని లాహోర్, ముల్తాన్, క్వెట్టా వరకు విస్తరించాయి. భారత్లోని పలు ప్రాంతాల్లోనూ ప్రకంపనలు నమోదైనట్లు సమాచారం. ఇదిలా ఉండగా పొరుగుదేశం పాకిస్థాన్లోనూ భూకంపం సంభవించింది. అయితే, ఇక్కడ ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సభవించలేదు. అలాగే మలేషియాలో సైతం అర్ధరాత్రి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 5.1 తీవ్రతతో ప్రకంపనలు రికార్డయ్యాయి.