న్యూయార్క్: యెమెన్లోని జైలుపై జరిగిన వైమానిక దాడిలో 70 మంది ఖైదీలు మృతిచెందిన ఘటనను ఐక్యరాజ్యసమితి ఖండించింది. హౌతీల ప్రాబల్యం ఉన్న సాదా నగరంలో ఉన్న డిటెన్షన్ సెంటర్పై శుక్రవారం దాడి జరిగింది. యెమెన్లో జరుగుతున్న ఉద్రిక్త సంఘటనలకు స్వస్తి పలకాలని యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ ఓ ప్రకటనలో తెలిపారు. అయితే హౌతి రెబల్స్ ప్రాంతంపై దాడి చేసినట్లు వస్తున్న వార్తలను సౌదీ దళాలు ఖండించాయి. ఆ వైమానిక దాడి తాము చేయలేదన్నట్లు తెలిపాయి. 2015 నుంచి యెమెన్లో సౌదీ దళాలు, హౌతీ రెబల్స్ మధ్య పోరు సాగుతోంది. ఆ ఘర్షణల్లో వేలాది మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. దాంట్లో పది వేల మంది చిన్నారులున్నారు. లక్షల సంఖ్యలో నిరాశ్రయులయ్యారు. అక్కడి జనాభా తీవ్ర దుర్భిక్షంతో బాధపడుతోంది.