అగ్రరాజ్యం అమెరికాలో ఘోరం జరిగింది. ఇళ్లు తగలబడి నష్టపోయిన వారికి సాయం చేయాలని ఫండ్ రైజర్ కార్యక్రమం జరుగుతోంది. వాళ్లను చూసిన ఒక డ్రైవర్.. తను నడుపుతున్న వాహనాన్ని ఆ గుంపుపైకి తోలాడు. ఈ ఘటన కొలంబియా కౌంటీలో వెలుగు చూసింది. సదరు డ్రైవర్ వయసు 24 సంవత్సరాలని పోలీసులు తెలిపారు.
ఫండ్రైజర్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలను వాహనంతో తొక్కేసిన ఘటనలో ఒక వ్యక్తి మరణించగా.. మరో 17 మంది తీవ్రంగా గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటన తర్వాత నిందితుడు నేరుగా ఇంటికెళ్లాడు. అక్కడ తన సొంత తల్లిని హతమార్చాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సదరు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు.