న్యూయార్క్: అమెరికాలోని మిస్సీస్సిప్పీ రాష్ట్రంలో శుక్రవారం రాత్రి ఏర్పడ్డ టోర్నడోల ధాటికి దాదాపు 23 మంది దుర్మరణం చెందారు. సుడిగాలి వల్ల ఇండ్లు, భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలిగింది. తీవ్ర తుఫాను వల్ల అలబామా, టెన్నెస్సీ, మిస్సీస్సిప్పీ రాష్ర్టాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.