న్యూయార్క్, మార్చి 29: వారంలో ఒకటి రెండు రోజులు 8 వేల అడుగులు నడిస్తే ముందస్తు మరణ ముప్పు గణనీయంగా తగ్గుతుందని ఒక పరిశోధన వెల్లడించింది. క్రమం తప్పకుండా వ్యాయామంతో మరణముప్పు తగ్గుతుందని గత పరిశోధనలు రుజువు చేసాయి.
అయితే వారంలో కేవలం ఒకటి రెండు రోజులు మాత్రమే విస్తృతంగా వ్యాయామం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తూ ‘జమా’ నెట్వర్క్లో ఒక పరిశోధనా వ్యాసం ప్రచురితమైంది. దీని ప్రకారం వారానికి ఒకటి రెండు రోజులు 8 వేల అడుగులు నడవడం వల్ల ముందస్తు మరణముప్పు తగ్గుతుందని తేలింది. కాలిఫోర్నియా యూనివర్సిటీ, జపాన్లోని క్యోటో యూనివర్సిటీ పరిశోధకులు ఈ విషయం వెల్లడించారు.