నైరుతి పసిఫిక్లోని ద్వీప దేశమైన పపువా న్యూ గినియాలో తీవ్ర ప్రకృతి విపత్తు సంభవించింది. ఓ గ్రామంలో కొండచరియలు విరిగి పడటంతో వంద మందికిపైగా మృతి చెందగా, వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు.
రాజధాని పోర్ట్మోర్స్బీకి 600 కిలోమీటర్ల దూరంలోని ఎంగా ప్రావిన్స్లోని కవోకలామ్ గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటలకు ఈ ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి ఈ ప్రమాదం చోటుచేసుకోవడంతో కొండచరియలు కింద పడి చాలామంది మరణించారని, మృతుల సంఖ్య వందకంటే ఎక్కువే ఉంటుందని అధికారులు తెలిపారు.