వాషింగ్టన్: అమెరికాకు చెందిన పలు ఉత్పత్తులపై భారత్ అధిక పన్నులు విధిస్తున్నదని అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ మరోసారి వ్యాఖ్యానించారు. వచ్చే ఏడాది జరుగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించి, తాను మళ్లీ అధ్యక్ష బాధ్యతలు చేపడితే భారత్పై ప్రతీకార పన్నులు విధిస్తానని హెచ్చరించారు. 2019లో ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో భారత్ను టారిఫ్ కింగ్ అంటూ అభివర్ణించారు. భారత్కు ఉన్న జీఎస్పీ హోదాను రద్దు చేశారు.