లండన్, నవంబర్ 19: వాహనాలు ప్రయాణిస్తున్నప్పుడు బ్రిడ్జి కండీషన్ ఎలా ఉందో తెలుసుకొనే మొబైల్ యాప్ను మాసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) పరిశోధకులు అభివృద్ధి చేశారు. వాహనాల్లో ప్రత్యేక సాఫ్ట్వేర్తో రూపొందిన స్మార్ట్ఫోన్లు వంతెనను దాటేటప్పుడు ఆ వంతెన నిర్మాణానికి సంబంధించిన సమగ్ర డాటాను సేకరిస్తాయని తెలిపారు. బ్రిడ్జిలకు అమర్చిన సెన్సార్ల కంటే.. ఈ విధానం తక్కువ ఖర్చుతో కూడుకున్న మెరుగైన ప్రత్యామ్నాయమని వారు తెలిపారు. బ్రిడ్జిలో ఎలాంటి లోపమున్నా మొబైల్ ఫోన్ హెచ్చరికలు జారీచేస్తుందని పరిశోధకులు పేర్కొన్నారు.