Trending news : ఓ వ్యక్తి బొద్దింకను చంపబోయి తన ఇంటినే కాల్చుకున్నాడు. బొద్దింక కనపడగానే చంపేందుకు దాని మీద పరుగుల మందు పిచికారి చేశాడు. అది తప్పించుకుని పోతావుంటే వెంటపడి పురుగుల మందు కొట్టాడు. అయినా బొద్దింక చావకపోగా పరుగుల మందు ఎలక్ట్రిక్ పరికరాల మీద పడి పేలుడు సంభవించడంతో ఇల్లు కాలిపోయింది. పేలుడు ధాటికి ఇంటి బాల్కనీ కిటికీ ఊడిపోయి అతడికి తగలడంతో స్వల్ప గాయాలయ్యాయి.
వివరాల్లోకి వెళ్తే.. జపాన్కు చెందిన కుమా మోటో (54) ఈ నెల 10న అర్ధరాత్రి తన అపార్టమెంట్ ఫ్లాట్లో బొద్దింకను చూశాడు. వెంటనే దాన్ని చంపాలని నిర్ణయించుకుని దానిపైన పురుగుల మందు పిచికారీ చేయడం మొదలుపెట్టాడు. అది పారిపోతావుంటే వెంటపడి పెస్టిసైడ్స్ కొట్టాడు. అయినా అది తప్పించుకుని పోయింది. కానీ పురుగుల మందు విద్యుత్ పరికరాల మీద పడి ఒక్కసారిగా పేలుడు సంభవించింది. మంటలు చెలరేగి ఇంట్లోని సామాగ్రి కాలిపోయింది. పేలుడు ధాటికి బాల్కనీలోని కిటికి ఊడిపోయి కుమా మోటోకు తగిలింది. దాంతో అతనికి స్వల్ప గాయాలయ్యాయి.
విద్యుత్ పరికరాల మీద కొన్ని రకాల పెస్టిసైడ్స్ను పిచికారీ చేయడంవల్ల పేలుళ్లు సంభవిస్తాయని జపాన్ నేషనల్ కన్జ్యూమర్ ఎఫైర్స్ సెంటర్ తెలిపింది. పలు పెస్ట్ రిమూవల్ కంపెనీల నివేదికలు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. పెస్టిసైడ్స్లో ఆల్కహాల్ లాంటి మండే పదార్థాలు ఉంటాయని, అవి విద్యుత్ పరికరాల మీద పడినప్పుడు పేలుడు సంభవించే అవకాశం ఉంటుందని తెలిపాయి.