ఫ్లోరిడా, జూలై 2: ఆంధ్రప్రదేశ్లోని బాపట్లకు చెందిన వ్యక్తి అమెరికాలో మృతి చెందాడు. పిల్లలను రక్షించే క్రమంలో తాను సముద్రంలో కొట్టుకుపోయి ప్రాణాలు విడిచాడు. ఉద్యోగ రీత్యా ఫ్లోరిడా రాష్ట్రంలోని బ్రిడ్జ్ వాటర్ కంపెనీలో పనిచేస్తున్న పొట్టి రాజేశ్ కుమార్ వారాంతపు వినోదం కోసం శనివారం భార్య, ఇద్దరు పిల్లలతో జాక్సన్ విల్ విట్లర్ బీచ్కు వెళ్లారు.
పిల్లలు అలల వద్ద ఆడుకుంటూ హఠాత్తుగా అందులో కొట్టుకుపోసాగారు. ఇది గమనించిన రాజేష్ వారిని కాపాడి ఒడ్డుకు చేర్చాడు. అయితే తాను మాత్రం సముద్రంలో కొట్టుకుపోయాడు. పోలీసులు అతని మృతదేహాన్ని గాలించి ఒడ్డుకు చేర్చారు.