ఐస్ల్యాండ్, నవంబర్ 11: స్వల్ప, మధ్య స్థాయిలో భూకంపాలు కుదిపేయడంతో ఐరోపాలోని ద్వీప దేశం ఐస్ల్యాండ్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. శుక్రవారం కేవలం 14 గంటల వ్యవధిలో రెక్జానెస్ ప్రాంతంలో 800 భూకంపాలు చోటు చేసుకున్నాయి. ఈ భూకంపాల కారణంగా అగ్ని పర్వతాల విస్ఫోటనం కూడా సంభవించే ప్రమాదముందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామని అధికారులు తెలిపారు.