టోక్యో: ఒక కార్గో షిప్ సముద్రంలో మునిగిపోయింది. ఈ ప్రమాద సమయంలో నౌకలో ఉన్న 22 మంది సిబ్బందిలో 8 మంది మరణించారు. మృతుల్లో ఆరుగురు చైనా జాతీయులు. జపాన్, దక్షిణ కొరియా మధ్య సముద్రంలో ఈ సంఘటన జరిగింది. హాంకాంగ్ కంపెనీకి చెందిన 6,551 టన్నుల బరువున్న జిన్ టియాన్ రవాణా నౌక డిసెంబరు 3న మలేషియాలోని పోర్ట్ క్లాంగ్ నుంచి బయలుదేరింది. కలప లోడ్తో దక్షిణ కొరియాలోని ఇంచియాన్ పోర్ట్కు వెళ్తున్నది. అయితే బుధవారం తెల్లవారుజామున జపాన్లోని నాగసాకికి నైరుతి దిశలో 160 కిలోమీటర్ల దూరంలో ఈ కార్గో షిప్ మునిగిపోయింది. ఆ సమయంలో నౌకలో 22 మంది సిబ్బంది ఉన్నారు. ఇందులో చైనా జాతీయులు 14 మంది కాగా, మిగతా ఎనిమిది మంది మయన్మార్కు చెందిన వారు.
కాగా, కార్గో షిప్ ప్రమాదం గురించి తెలుసుకున్న జపాన్, దక్షిణ కొరియా కోస్ట్గార్డ్ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఐదుగురు సిబ్బందిని కాపాడారు. వీరిలో నలుగురు చైనా జాతీయులు. ఆరుగురు చైనీయులతో సహా 8 మంది సిబ్బంది మరణించగా మిగతా 9 మంది గల్లంతైనట్లు తెలుస్తున్నది.