Suicide Attack | పొరుగుదేశం పాకిస్థాన్ (Pakistan)లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఆఫ్ఘానిస్థాన్ సరిహద్దు ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్స్ (Khyber Pakhtunkhwa province)లోని వజీరిస్థాన్ (Waziristan) జిల్లాలో సైనిక స్థావరం (military base)పై ఆత్మాహుతి దాడి (Suicide Attack) చేశారు. ఈ దాడిలో ఏడుగురు పాక్ జవాన్లు మరణించారు.
ఉగ్రవాదులు ముందుగా భారీగా పేలుడు పదార్థాలను అమర్చిన వాహనంతో సైనిక పోస్టును ఢీ కొట్టినట్లు పాక్ సైన్యం వెల్లడించింది. ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. అనంతరం జరిగిన కాల్పుల్లో ఇద్దరు ఆఫీసర్లు మరణించినట్లు వెల్లడించింది. ఈ ఘటనతో అప్రమత్తమైన సైన్యం ఉగ్రవాదులపై కాల్పులు జరపగా.. ఈ కాల్పుల్లో ఆరుగురు ఉగ్రవాదులు హతమైనట్లు తెలిపింది. కాగా, కొత్తగా ఏర్పాటు చేసిన జైషే పురాసనే మహమ్మద్ సంస్థ (Jaish-e-Fursan-e-Muhammad) ఈ దాడికి బాధ్యత వహించింది.
Also Read..
Anand Mahindra | తీవ్ర నీటి ఎద్దడి వేళ.. వినూత్న ఆలోచన పంచుకున్న ఆనంద్ మహీంద్రా.. VIDEO
Afghanistan | ఆఫ్ఘానిస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది మృతి
Cotton candy | పీచు మిఠాయిపై మరో రాష్ట్రంలోనూ నిషేధం.. ఎందుకంటే