న్యూఢిల్లీ: పసిఫిక్ మహాసముద్రంలోని ద్వీప దేశమైన పపువా న్యూగనియాలో (Papua New Guinea)భారీ భూకంపం సభవించింది. ఆదివారం తెల్లవారుజామున కైనాంన్టూలో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.6గా నమోదయిందని యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. రాజధాని పోర్ట్ మోర్స్బేకి 480 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని తెలిపింది. భూఅంతర్భాగంలో 68 కిలోమీటర్ల లోతులో భూ ప్రకంపణలు చోటుచేసుకున్నాయని పేర్కొన్నంది. భారీ భూకంపం నేపథ్యంలో సునామీ హెచ్చరికలు జారీచేసింది.
కాగా, భూకంప ప్రభావంతో పోర్ట్ మోర్స్బేతోపాటు మడాంగ్, కైనాంన్టూలో భవనాలు ఊగిపోయాయని, మరికొన్ని చోట్ల ఇండ్లు కూలిపోయాయని, విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని అధికారులు తెలిపారు. సముద్రతీరంలోని కొన్ని ప్రాంతాల్లో భూమి కుంగిపోయిందని వెల్లడించారు.
2004లో భారీ భూకంపం పపువా న్యూగనియాను కుదిపేసింది. సముద్ర గర్భంతో 9.1 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. దీంతో న్యూగనియాతోపాటు సమీప ప్రాంతాల్లో 2 లక్షల 20 మంది మరణించారు.
🔔#Earthquake M7.6 occurred 67 km E of #Kainantu (Papua New Guinea) 19 min ago (local time 09:46:58). More info at:
📱https://t.co/LBaVNedgF9
🌐https://t.co/8gkZ80Q3bj
🖥https://t.co/fbK9GLtgw8 pic.twitter.com/dhRRKAgi2N— EMSC (@LastQuake) September 11, 2022