జోహెన్నస్బర్గ్: బ్రిక్స్ కూటమి మరింత బలోపేతం కానుంది. బ్రిక్స్ గ్రూప్లో మరో ఆరు దేశాలు చేరనున్నాయి. అర్జెంటీనా, ఈజిప్ట్, యూఏఈ, ఇరాన్, సౌదీ అరేబియా, ఇథియోపియాలకు సభ్యత్వం ఇవ్వాలని దక్షిణాఫ్రికాలో జరిగిన సదస్సులో సభ్య దేశాలు నిర్ణయించాయి.
గురువారం సభ్య దేశాల నేతలు భారత ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు రామఫోస, బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా ద సిల్వా మీడియా సమావేశంలో ఈ విషయాన్ని తెలిపారు. 2024 జనవరి నుంచి నూతన దేశాలకు సభ్యత్వం లభిస్తుందని తెలిపారు.