Earth Quake- Philippines | దక్షిణ ఫిలిప్పైన్స్లో శుక్రవారం శక్తిమంతమైన భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 6.7గా నమోదైందని యూఎస్ జియాలజికల్ సర్వే పేర్కొంది. ఆస్థినష్టం జరిగి ఉండొచ్చునని స్థానిక అధికారులు హెచ్చరించారు. అయితే సునామీ ముప్పు లేదన్నారు. దక్షిణ ద్వీపం మిండానావోలోని సారంగాణి రాష్ట్ర పరిధిలో 78 కి.మీ లోతున భూకంప కేంద్రం కేంద్రీక్రుతమైందని యూఎస్ జియలాజికల్ సర్వే తెలిపింది. ఉదయం 8.14 గంటలకు భూంకం సంభవించింది. ప్రాణనష్టం గురించి తక్షణ నివేదికలు వెల్లడించలేదు.
కానీ, పర్వత ప్రాంతం పొడవునా భూ ప్రకంపనలు కొనసాగాయని తెలుస్తున్నది. దావావో సిటీకి చెందిన కీషియా లేయ్రాన్ (27) ఓ సదస్సులో మాట్లాడుతూ ఇది అత్యంత శక్తిమంతమైన భూకంపం అని పేర్కొన్నారు. సదస్సులో తన చుట్టూ ఉన్న వారు ఆందోళనతో బయటకు పరుగులు తీశారని చెప్పారు. పసిఫిక్ సముద్ర తీరానికి ఆనుకుని ఉండటంతో ఫిలిప్పైన్స్ లో నిత్యం భూకంపాలు జరుగుతుంటాయి. అందుకే ఫిలిప్పైన్స్ ను ‘రింగ్ ఆఫ్ ఫైర్’ అని అభివర్ణిస్తారు.