ఖాట్మండూ: హిమాలయ దేశం నేపాల్లో భూకంపం (Earthquake) వచ్చింది. శుక్రవారం తెల్లవారుజామున సింధుపల్చోక్ జిల్లాలోని భైరవకుండ వద్ద భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.1గా నమోదయింది. భైరవకుండ సమీపంలోనే భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. భూమి కంపించడంతో ప్రజలు భయంతో ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కాగా, భూకంపం కారణంగా ఎలాంటి నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. దుగుంగడి భీర్లో కొండచరియలు విరిగిపడ్డాయని, అయితే ఆ ప్రదేశంలో ఇండ్లు లేవని చెప్పారు. భారత్తోపాటు చైనా, టిబెట్ సరిహద్దుల్లో కూడా భూమి స్వల్పంగా కంపించదన్నారు.
An earthquake with a magnitude of 5.5 on the Richter Scale hit Nepal at 2.36 IST today.
(Source – National Center for Seismology) pic.twitter.com/OtockGLncO
— ANI (@ANI) February 27, 2025
నేపాల్ భూకంప ప్రభావంతో ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో ప్రకంపణలు చోటుచేసుకున్నాయి. బీహార్ రాజధాని పాట్నాతోపాటు పశ్చిమబెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనలతో ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కాగా, పాట్నాలో భూకంపానికి సంబంధించి పలు వీడియోలను పలువురు సోషల్ మీడియాలు పోస్టు చేశారు. 35 సెకండ్లపాటు భూమి కంపించిందని, దీంతో ఇండ్లలో ఫ్యాన్లు, వస్తువులు ఊగిపోయాయని తెలిపారు. ఈ ఏడాది జనవరిలో టిబెల్లో వరుసగా ఆరుసార్లు భూకంపం వచ్చిన విషయం తెలిసిందే. ఇందులో 7.1 తీవ్రత నమోదవగా, 125 మందికిపైగా మరణించారు.
Un sismo de magnitud 5.5 sacudió hoy cerca de Kathmandu, Nepal. El sismo se sintió con fuerza en la India, Bután y Bangladesh. Sin embargo, no se reportan víctima ni daños. #earthquake pic.twitter.com/X49YtPaUrf
— Centinela35 (@Centinela_35) February 28, 2025
#Earthquake jolts #Patna at 2:37 am pic.twitter.com/6EpPy473ZN
— K Sarvottam (@k_sarvottam21) February 27, 2025