టెహ్రాన్ : ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణానికి కారకులైన అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహులను హతమార్చడానికి భారీ ఆర్థిక బహుమతులను ప్రకటించే చట్టాన్ని రూపొందించడంపై ఇరాన్ పార్లమెంట్ సభ్యులు చర్చిస్తున్నారు.
టెలిగ్రాఫ్ యూకే నివేదిక ప్రకారం ఇరాన్ జాతీయ భద్రతా కమిషన్ చైర్మన్ ఇబ్రహీం అజీజీ మాట్లాడుతూ చట్టసభ సభ్యులు ‘ఇస్లామిక్ రిపబిక్ సైనిక, భద్రతా దళాల పరస్పర చర్య’ అనే పేరుతో ఒక బిల్లును సిద్ధం చేస్తున్నారని, అందులో ట్రంప్ను చంపిన వారికి 50 మిలియన్ యూరోలు (సుమారు రూ. 560.85 కోట్లు) బహుమతిని ప్రకటించనున్నారని తెలిపారు.