బీజింగ్: చైనాలో (China) ఆదివారం తెల్లవారుజామున భారీ భూకంపం (Earthquake) వచ్చింది. రాజధాని బీజింగ్కు (Beijing) 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న డెజౌ (Dezhou) నగరంలో వేకువజామున 2.33 గంటలకు భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.5గా నమోదయినట్లు చైనా ఎర్త్క్వేక్ నెట్వర్క్స్ సెంటర్ (CENC) వెల్లడించింది. దీని ప్రభావంతో నగరంలోని 74 ఇండ్లు నేలమట్టమయ్యాయని ప్రభుత్వ మీడియా చైనా సెంట్రల్ టీవీ ప్రకటించింది. దీంతో 10 మంది గాయపడ్డారని తెలిపింది. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదని వెల్లడించింది. భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో భూమి కంపించిందని పేర్కొంది.
కాగా, శనివారం రాత్రి అఫ్గానిస్థాన్లో (Afghanistan) భూకంపం వచ్చిన విషయం తెలిసిందే. రాత్రి 9.31 గంటలకు హిందూకుష్ పర్వత శ్రేణుల్లో 5.8 తీవ్రతలో భూమి కంపించింది. అఫ్గానిస్థాన్తోపాటు పాకిస్థాన్, జమ్ముకశ్మీర్ సరిహద్దుల్లో 181 కి.మీ లోతున భూకంప కేంద్రం కేంద్రీకృతమైంది. అయితే దీని ప్రభావంతో ఢిల్లీ, దేశ రాజధాని (NCR) ప్రాంతంలో కూడా భూమి కంపించింది. దీంతో ఢిల్లీ పరిసర ప్రాంతాల వాసులు భయాందోళనతో తమ ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
Earthquake of Magnitude:5.8, Occurred on 05-08-2023, 21:31:48 IST, Lat: 36.38 & Long: 70.77, Depth: 181 Km ,Location: Hindu Kush Region,Afghanistan for more information Download the BhooKamp App https://t.co/RXbLMDY0eW @ndmaindia @Indiametdept @KirenRijiju @Dr_Mishra1966 pic.twitter.com/1Tu1TBDqCO
— National Center for Seismology (@NCS_Earthquake) August 5, 2023