న్యూఢిల్లీ: పాకిస్థాన్లో భారీ భూకంపం (Earthquake) వచ్చింది. ఆదివారం తెల్లవారుజామున 3.54 గంటల సమయంలో పాక్లో భూమి కంపించింది. దీని తీవ్రత 5.2గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది. భూ అంతర్భాగంలో 150 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని వెల్లడించింది. కాగా, భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు పేర్కొన్నారు.
కాగా, శనివారం పాక్లో రెండు సార్లు భూమి కంపించింది. సాయంత్రం 6.53 నుంచి 7 గంటల మధ్య రెండు భూకంపాలు వచ్చాయి. తొలుత 4.4 తీవ్రతతో ప్రకంపణలు చోటుచేసుకోగా, రెండో సారి 3.2 తీవ్రతతో భూమి కంపించింది. కరాచీలో కూడా భూ ప్రకంపణలు సంభవించాయి. ఈ నెల 1 నుంచి పాకిస్థాన్లో 21 సార్లు భూకంపం రావడం గమనార్హం.
EQ of M: 5.2, On: 29/06/2025 03:54:02 IST, Lat: 30.25 N, Long: 69.82 E, Depth: 150 Km, Location: Pakistan.
For more information Download the BhooKamp App https://t.co/5gCOtjdtw0 @DrJitendraSingh @OfficeOfDrJS @Ravi_MoES @Dr_Mishra1966 @ndmaindia pic.twitter.com/QO5B8YcWFD— National Center for Seismology (@NCS_Earthquake) June 28, 2025
శుక్రవారం రాత్రి అండమాన్ సముద్రంలో కూడా భూకంపం సంభవించింది. రాత్రి 8.28 గంటల సమయంలో 4.6 తీవ్రతతో భూమి కంపించినట్లు ఎన్సీఎస్ వెల్లడించింది. భూమికి 25 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం కేంద్రం ఉన్నదని తెలిపింది. అండమాన్, నికోబార్ దీవులలోని పోర్ట్బ్లెయిర్కు 254 కి.మీ ఆగ్నేయంలో ఈ భూకంపం సంభవించినట్టు తెలుస్తోంది. ఈ భూ ప్రకంపనలతో సముద్రం ఒక్కసారిగా అల్లకల్లోలంగా మారింది.