ఇస్లామాబాద్: పాకిస్థాన్లో తాలిబన్లు ఆత్మాహుతికి పాల్పడిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకే పెరుగుతున్నది. ఇవాళ మధ్యాహ్నం దాడి జరగగా సాయంత్రానికి మృతుల సంఖ్య 46కు చేరింది. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నది. పాకిస్థాన్లోని పెషావర్ నగరంలోగల హై సెక్యూరిటీ జోన్లో ఓ మసీదులో ఈ ఆత్మాహుతి దాడి జరిగింది.
పోలీస్ లైన్స్ ప్రాంతంలోని మసీదులో ప్రార్థనలు జరుగుతున్న సమయంలో పేలుడు సంభవించింది. ఈ దాడిలో అక్కడికక్కడే 25 మంది ప్రాణాలు కోల్పోగా సాయంత్రానికి మృతుల సంఖ్య 46కు చేరింది. ఇంకా 100 మందికిపైగా క్షతగాత్రులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కాగా, ఆత్మాహుతి దాడి జరిగిన ప్రాంతాన్ని పోలీసులు సీజ్ చేశారు. కేవలం అంబులెన్స్లను మాత్రమే అనుమతిస్తున్నారు.