రియో డి జనీరో, ఏప్రిల్ 17: కరోనా రక్కసి ప్రపంచవ్యాప్తంగా మృత్యుఘంటికలు మోగిస్తున్నది. మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య శనివారం 30 లక్షలు దాటింది. బ్రెజిల్, భారత్, ఫ్రాన్స్లలో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ గణాంకాల ప్రకారం.. కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య కీవ్, ఉక్రెయిన్, కరాకస్, వెనెజులా దేశాల జనాభాతో సమానం. అమెరికాలోని షికాగో నగర జనాభా (27 లక్షలు) కంటే అధికం. పలు ప్రభుత్వాలు మరణాలను దాచే అవకాశం ఉన్న నేపథ్యంలో వాస్తవ మరణాల సంఖ్య ఇంతకంటే ఎక్కువగానే ఉంటుందని అంచనా.
ప్రపంచవ్యాప్తంగా రోజుకు సగటున 7 లక్షలకుపైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. 12 వేల మందికిపైగా మృత్యువాతపడుతున్నారు. ఒక్క అమెరికాలోనే ఇప్పటివరకు 5.6 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచం మొత్తం మరణాల్లో ఆరింట ఒక వంతు అమెరికాలోనే చోటుచేసుకున్నాయి. అమెరికా తర్వాతి స్థానాల్లో బ్రెజిల్, మెక్సికో, భారత్, బ్రిటన్ ఉన్నాయి.
కరోనా మహమ్మారి తగ్గినట్టే తగ్గి మళ్లీ ఉద్ధృతంగా వ్యాపిస్తుండటంతో ప్రపంచ దేశాలు మళ్లీ కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి. అలాగే వ్యాక్సినేషన్ను ఉద్ధృతం చేస్తున్నాయి. అయితే వ్యాక్సిన్ల కొరత పలు దేశాలను వేధిస్తున్నది. మరోవైపు, రక్తం గడ్డకట్టడం వంటి దుష్ప్రభావాలు కనిపిస్తుండటంతో పలు దేశాల్లో జాన్సన్ అండ్ జాన్సన్, అస్ట్రాజెనెకా టీకాలపై తాత్కాలిక నిషేధం విధించారు.
దేశం కేసులు
అమెరికా 3.15,67,744
భారత్ 1,45,26,609
బ్రెజిల్ 1,38,32,455
ఫ్రాన్స్ 52,85,307
రష్యా 46,40,537
అమెరికా 5,66,240
బ్రెజిల్ 3,68,749
మెక్సికో 2,11,693
భారత్ 1,75,649
బ్రిటన్ 1,27,472