ఇస్లామాబాద్, ఆగస్టు 6: పాకిస్థాన్లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. హజారా ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పి బోల్తాపడిన ప్రమాదంలో 33 మంది ప్రయాణికులు మృతి చెందగా, 80 మందికిపైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరగవచ్చని భావిస్తున్నారు.
ఆదివారం హజారా ఎక్స్ప్రెస్ రావల్పిండి నుంచి కరాచీకి వెళ్తుండగా సహారా రైల్వే స్టేషన్ సమీపంలోని షహజద్పూర్- నవాబ్షా స్టేషన్ల మధ్య ఈ ప్రమాదం జరిగింది. 10 బోగీలు పట్టాలు తప్పి చెల్లాచెదురుగా పడ్డాయి.