బీజింగ్: చైనాను మరోసారి వరదలు ముంచెత్తాయి. కుండపోత వర్షాల కారణంగా ఉత్తర చైనాలో వరదలు పోటెత్తడంతో 29 మంది మరణించారు. దాదాపు 1.20 లక్షల మంది నిరాశ్రయులుగా మారినట్టు స్థానిక ప్రభుత్వం వెల్లడించింది. పింగ్షాన్ కౌంటీలో ఓ బస్సు నదిలో కొట్టుకుపోవడంతో 14 మంది ప్రాణాలు కోల్పోయారు.